డీఎస్పీ శ్రీనివాసులు
విశాలాంధ్ర -ధర్మవరం:; దేశవ్యాప్తంగా జూలై 1వ తేదీ 2024 నుండి అమలు కాబోతున్న కొత్త చట్టాల గూర్చి ధర్మవరం డివిజన్ పరిధిలోని కానిస్టేబుల్ స్థాయి నుండి సిఐ స్థాయి వరకు గలవారికి సాయి నగర్ శ్రీ షిరిడి సాయిబాబా కళ్యాణ మండపంలో డిఎస్పి శ్రీనివాసులు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ ఈ అవగాహన సదస్సులో 6 మంది శిక్షకులు కొత్త చట్టాలపై గల వివరాలను తెలియజేశారు. సాంకేతిక సాక్షాధారణ, సేకరణ, భద్రపరచు విధానం, సాంకేతిక వినియోగం గూర్చి వివరించడం జరిగింది. సాంకేతిక నిపుణుల చేత ప్రతి చట్టం యొక్క వివరణ అందరికీ తెలియజేయడం జరిగిందని వారు తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పుట్టపర్తి జిల్లా ఐటి కోర్ కి వారిచే అమలు కాబోతున్న కొత్త చట్టాలు, సి సి టి ఎన్ ఎస్ అప్లికేషన్లో వచ్చిన అప్డేట్ గూర్చి, ఈ సాక్ష్య యాప్ గురించి వివరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి తో పాటు సబ్ డివిజన్ పరిధిలోని సిఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.