London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Monday, October 7, 2024
Monday, October 7, 2024

అర్జీలకు వేగంగా పరిష్కారం చూపించాలి

జిల్లాలోని అసైన్ ల్యాండ్స్ ఫ్రీ హోల్డ్ పరిశీలన ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి

విశాలాంధ్ర -అనంతపురం : అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో సోమవారం నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ అర్జీలను స్వీకరించారు.
జిల్లా కలెక్టర్ తో పాటు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జెడి ఉమామహేశ్వరమ్మ, సివిల్ సప్లై డిఎం(ఇంచార్జ్ డిఆర్ఓ) రమేష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి 422 అర్జీలను స్వీకరించడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వస్తున్న అర్జీలను ఎలాంటి ఆలస్యం లేకుండా త్వరితగతిన పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. అర్జీలను నాణ్యతగా పరిష్కరించడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతిరోజు అర్జీల పరిష్కారానికి సమయం కేటాయించాలన్నారు. అర్జీలను ఎలాంటి పెండింగ్ ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
జిల్లాలో అసైన్ ల్యాండ్స్ ఫ్రీ హోల్డ్ పరిశీలన ప్రక్రియ జిల్లాలో దాదాపు 34 వేల ఎకరాల భూమికి సంబంధించి ఇప్పటివరకు దాదాపు 23వేల ఎకరాల భూమికి సంబంధించి పూర్తి చేయడం జరిగిందని మిగిలిన పెండింగ్ ఉన్న వాటిని త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. ఇందులో ఎక్కువ సంఖ్యలో కళ్యాణదుర్గం సబ్ డివిజన్ నందు 9,338 పెండింగ్ ఉన్నాయని, దీనిని త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్, ఆర్డిఓ, తహసీల్దార్ లకు ఆదేశించారు.ప్రజలకు అవసరమైన 100 ముఖ్యమైన సేవలకు సంబంధించిన బోర్డులను ఎంపీడీవో కార్యాలయం నందు క్లుప్తంగా అర్థమయ్యే విధంగా, కనపడే విధంగా ఏర్పాటు చేయాలని జడ్పీ సీఈవోను ఆదేశించారు. అలాగే జిల్లాలోని తహసీల్దార్ కార్యాలయాలలో 100 ముఖ్యమైన సేవలకు సంబంధించిన బోర్డులను జిల్లా అంతా ఒకే విధంగా ఉండే లా ఫ్లెక్సీలు కాకుండా బోర్డులను తయారు చేసి జిల్లా లోని తహసిల్దార్ కార్యాలయాలకు త్వరితగతిన పంపిణీ చేసే విధంగా చూడాలని పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం తహసీల్దార్ ను ఆదేశించారు.
ఈ పంట నమోదు ప్రక్రియ నందు చేస్తే సమయంలో మైక్రో ఇరిగేషన్ సంబంధించి డిప్ ఇరిగేషన్ ప్రక్రియను మండల్ అగ్రికల్చర్, హార్టికల్చర్ అధికారులు గ్రామస్థాయిలోకి వెళ్లి అగ్రికల్చర్, హార్టికల్చర్ అసిస్టెంట్ల ద్వారా నమోదు చేయించాలని, దీనికి సంబంధించి ఆర్డీవోలు, ఏడి ఆర్టికల్చర్, ఏడి అగ్రికల్చర్ సమావేశమై ఏర్పాటుచేసి, మండల స్థాయిలో తహసీల్దార్, మండల్ హార్టికల్చర్, అగ్రికల్చర్ వారితో సమావేశం ఏర్పాటు చేసి త్వరితగతిన పూర్తి చేసే విధంగా చూడాలన్నారు.
ప్రతి శాఖకు సంబంధించిన జిల్లా అధికారులు వారి శాఖ పరిధిలో ఒక అధికారిని కమాండ్ కంట్రోల్ రూమ్ ఇంచార్జ్ గా నియమించాలని, వారికి వాట్సాప్ గ్రూప్ ఏర్పాటుచేసి ప్రభుత్వ పథకాలు, పనులు వేగవంతంగా జరిగే విధంగా చూస్తూ సమాచారాన్ని వేగంగా ప్రజలకు చేరే విధంగా చూడాలన్నారు.
పిజిఆర్ఎస్ కు సంబంధించి పోలీస్ శాఖ వారు ఒక నోడల్ అధికారిని నియమించే విధంగా చూడాలని, వారు ప్రతిరోజు పర్యవేక్షించే విధంగా చూడాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. వెల్ఫేర్ అసిస్టెంట్ ప్రతి సోమ, గురువారాలలో స్కూల్ విజిట్ చేయాలని ఆదేశించారు.
గ్రామ మండల స్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల పంపిణీ జరిగే సమయంలో ఆర్భాటాలకు ప్రాధాన్యతను ఇవ్వకుండా ఎక్కువమంది ప్రజలతో మమేకమైనట్లుగా, పాల్గొనే విధంగా చూసి ప్రభుత్వ పథకాలు, అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారునికి చేరే విధంగా చూడాలన్నారు.
అనంతరం విజయవాడ వరద బాధితుల సహాయనిధి కోసం సింగనమల మండలం, శోధనపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, పిల్లల నుండి సేకరించిన పదివేల రూపాయల చెక్కును వివేకానంద స్కూల్, అసిస్టెంట్ సీఎం సహాయ నిధికి జిల్లా కలెక్టర్ కి అందజేశారు.
ఈ సమావేశంలో పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం తహసీల్దార్ వాణిశ్రీ, వ్యవసాయ శాఖ జెడి ఉమామహేశ్వరమ్మ, ఐసిడిఎస్ పిడి శ్రీదేవి, డిపిఓ నాగరాజు నాయుడు, ఆర్.అండ్.బి ఎస్ఈ ఓబుల్ రెడ్డి, డిఎంహెచ్ఓ డా.ఈబి.దేవి, సిపిఓ అశోక్ కుమార్, ఎల్డిఎం నర్సింగరావు, డ్వామా పిడి భాష, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి రాజశేఖర్ రెడ్డి, డిటిసి వీర్రాజు, జిల్లా సైనిక సంక్షేమ అధికారి పి.తిమ్మప్ప, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఎహసాన్ భాష, సర్వే ఏడి రూప్ల నాయక్, కలెక్టరేట్ ఏవో అలెగ్జాండర్, డీఆర్డీఏ పిడి ఈశ్వరయ్య, హార్టికల్చర్ డిడి నరసింహారావు, ఏపీఎంఐపి పిడి రఘునాథరెడ్డి, గ్రౌండ్ వాటర్ డిడి తిప్పేస్వామి, వికలాంగుల సంక్షేమ శాఖ ఏడి రసూల్, మార్కెటింగ్ ఏడీ చౌదరి, డిటిడబ్ల్యుఓ రామాంజనేయులు, డిసిఓ అరుణకుమారి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img