విశాలాంధ్ర ధర్మవరం:: మండల పరిధిలోని సీసీ కొత్తకోట సమీపంలో ఉడతరాల్ల గుట్ట వద్ద వెల్దూరి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ తాడిమర్రి సూర్యనారాయణ (48) ఈనెల 19వ తేదీ రాత్రి దారుణంగా కొంతమంది దుండగులు హత్య చేసి పరారయ్యారు. ఉడతరాల గుట్ట వద్ద గల ఉన్న రైతులు సమాచారాన్ని పోలీసులకు, వెల్దుర్తి గ్రామములోని కుటుంబ సభ్యులకు అందజేశారు. సంఘటన స్థలానికి రూరల్ ఎస్సై నరేంద్ర తో పాటు సిబ్బంది చేరుకొని హత్య జరిగిన తీరును వారు పరిశీలించారు. రాళ్లతో కొట్టి కొంతమంది దుండగులు చంపివేశారని పోలీసులు తెలిపారు. మృతుడు స్వగ్రామం ధర్మవరం నియోజకవర్గంలోని తాడిమర్రి మండలానికి చెందినవాడు అని, కుటుంబ పోషణ దృష్ట్యా వెల్దుర్తి గ్రామానికి చేరుకొని ఆటో నడుపుతూ తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. మరి సూర్యనారాయణ ను ఎవరు చంపారు? అన్నది పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. తదుపరి డాగ్స్ స్క్వాడ్ కూడా తెప్పించి, పరిశీలించారు. 22 సంవత్సరాల కింద వివాహం జరిగి అన్యోన్యంగా వారి జీవనం కొనసాగేది. వెల్దుర్తి లో గాని, వేరే మండలంలో గాని స్నేహితుడు గాని, శత్రువులు గాని చంపారా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. తదుపరి మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, సవ పరీక్ష అనంతరం కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ దారుణ హత్యను తొందర్లోనే చేదిస్తామని రూరల్ ఎస్సై తెలిపారు. మృతునికి భార్య కృష్ణవేణి తో పాటు, శిరీష, నందిని మన కూతుర్లు, కుమారుడు వంశీకృష్ణ ఉన్నారు. ఆటో డ్రైవర్ గా సూర్యనారాయణ మంచివాడు అని గ్రామస్తులు కూడా తెలుపుతున్నారు. మరి ఎందుకు సూర్యనారాయణ ను ఇంత కిరాతకంగా దారుణంగా, చంపాల్సి వచ్చిందో? పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. మొత్తం మీద కుటుంబంలో పోషించే వ్యక్తి చనిపోవడం వల్ల, ఆ కుటుంబం దిక్కులేని ది అయిందని స్థానికులు వాపోయారు. ఈ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని గ్రామస్తులు, బంధువులు కోరుతున్నారు.