విశాలాంధ్ర- ధర్మవరం:: పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో మోటార్ వెహికల్ చట్టమునకు సంబంధించిన కొన్ని విషయాలను కోర్టు అడ్వకేట్ బాలసుందరి, వన్ టౌన్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ నాగ పవన్ కుమార్ విద్యార్థులకు పలు చట్టాలను వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన చట్టాలు గూర్చి విద్యార్థులకు తెలియజేయడం జరిగిందని తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఎవరు కూడా వెహికల్ను నడప రాదని, మైనర్ అయిన విద్యార్థులు టూవీలర్లను నడపకూడదని తెలిపారు. తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లోనూ టూ వీలర్స్ ఇవ్వకూడదని వారు స్పష్టం చేశారు. అనంతరం విద్యార్థులకు వచ్చిన అనుమానాలను కూడా వారు నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రశాంతి, ఎన్ఎస్ఎస్ అధికారులు కొల్లాయి రెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.