స్ బ్.సిఐ. గురు ప్రసాద్.
విశాలాంధ్ర ధర్మవరం:: మత్తు పదార్థాలపై పట్టణంలోని పద్మావతి డిగ్రీ కళాశాల విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని సెబ్బ్ ఇన్స్పెక్టర్ గురు ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్తు పదార్థాలు వినియోగం వలన జీవితాలే నాశనమవుతాయని, కుటుంబాలు వీధిన పడతాయని తెలిపారు. మత్తు పదార్థాల వలన నష్టాలే అధికంగా ఉన్నాయన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని తెలిపారు. మత్తు పదార్థాలు సేవించడం వలన కలిగే అనారోగ్యము, పెట్టబోయే కేసులు, వాటి వలన కలిగే అనర్థాలు గూర్చి కూడా తెలియజేయడం జరిగిందన్నారు. ప్రజలు మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారంటే సమాజం తిరోగమనములో పయనిస్తుందని అర్థం అని తెలిపారు. అలాంటి చోట సామాజిక, మానసిక, శారీరక, అనారోగ్యాలు తలెత్తుతాయని తెలిపారు. అందుకే దేశ భవిష్యత్తును కొంగ తీసే ఈ మాదక ద్రవ్యాలను పగడ్బందీగా అరికట్టాల్సిన బాధ్యత విద్యార్థులదేనని తెలిపారు. మనదేశంలో ముఖ్యంగా యువతలో మాదకద్రవ్యాల దుర్వినియోగం పెరుగుతోందని తెలిపారు. ఇది ఆందోళన కలిగించే విషయంగా ప్రతి ఒక్కరూ గ్రహించాలని తెలిపారు. చట్ట విరుద్ధమైన మందులను వినియోగించే బోమని ప్రతి ఒక్కరూ గుర్తు ఎరగాలని తెలిపారు. అందుకే ప్రతి ఒక్కరూ డ్రగ్స్ కు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మావతి మహిళా కళాశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున, అధ్యాపకులు, సేబ్బు సిబ్బంది పాల్గొన్నారు.