ఐక్య విద్యార్థి సంఘం నాయకులు
దేశవ్యాప్తంగా నెలకొన్న విద్యా సమస్యలపై ఈ నెల నాలుగవ తేదీన విద్యాసంస్థల బందును నిర్వహిస్తున్నట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు దామోదర్, ఏఐఎస్బి జిల్లా ప్రధాన కార్యదర్శి పోతులయ్య, ఏపీ ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండి శివ గౌడ్, పి ఎస్ యు డివిజన్ అధ్యక్షుడు నందకిషోర్, ఎన్ ఎస్ యు ఐ పట్టణ అధ్యక్షులు గణేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల నీట్ పరీక్షలు రాసి నష్టపోయిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని పి.హెచ్.డి అడ్మిషన్ల కోసం ఇటీవల ఆమోదించిన తప్పనిసరిగా నెట్ స్కోర్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని వారు తెలిపారు. టి ఐ ఎస్ ఎస్ ముంబై, ఐఐటి ముంబై నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వరకు విద్యార్థి సంఘాల నేతలపై అక్రమ కేసులు నిర్బంధాలు తొలగించాలని, యూనివర్సిటీలో స్వేచ్ఛ వక్రీకరణ ప్రజాస్వామ్య అనిచివేత చర్యలను వెంటనే ఆపాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్షల నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలనే పలు విషయాలపై రామయ్య నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. మా సమస్యలు పరిష్కరించకపోతే ఐక్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బంద్ నిర్వహిస్తున్నట్లు వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ బి నాయకులు నందకిషోర్, పురుషోత్తం, సునీల్, సాయికుమార్, గణేష్, రాజు, ప్రమోద్, నారాయణస్వామి, రాము తదితరులు పాల్గొన్నారు.