ఆర్థిక సహాయం అందించిన చిలక మధుసూదన్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం:: ధర్మవరం మండలం పరిధిలోని రావులచెరువు గ్రామానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త మారుతి ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. సమాచారం అందుకున్న జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి నా కుటుంబానికి సంతాపాన్ని తెలియజేస్తూ మృతుని భార్య అశ్వినికి జనసేన పార్టీ తరఫున పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. పార్టీ కార్యకర్త మరణం బాధాకరమని తప్పకుండా మీ కుటుంబానికి జనసేన పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని కుటుంబానికి భరోసా ఇచ్చి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.