London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

మతిస్థిమితం లేని వృద్ధుడు రైలు కింద పడి మృతి..

హిందూపురం జిఆర్పి రైల్వే పోలీసులు
విశాలాంధ్ర ధర్మవరం:; పట్టణంలోని సుందరయ్య నగరకు చెందిన పెదగొండ గారి నరసింహులు (78) మతిస్మితం లేకపోవడంతో పట్టణంలోని రేగాటిపల్లి రైల్వే గేట్ కూతవేటి దూరములో రైలు కిందపడి మృతి చెందడం జరిగిందని రైల్వే జిఆర్పి పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా రైల్వే జి ఆర్ పి హెడ్ కానిస్టేబుల్ ఎర్రిస్వామి కృష్ణ మాట్లాడుతూ మృతి చెందిన వ్యక్తి సొంత గ్రామము చెన్నై కొత్తపల్లి మండలం మేడాపురం గ్రామము ఉండి, కొన్ని నెలల కిందట ధర్మవరం పట్టణం సుందరయ్య నగర్ లో వారి కుటుంబం వద్ద నివసించేవాడు. మృతునికి 2019లో డెంగీ జ్వరంతో నరాల బలహీనత, ఆస్మా, మూత్రపిండాల వ్యాధులు రావడం జరిగిందని, అనంతపురం తదితరచోట్ల వైద్య చికిత్సలు అందించిన ఫలితం లేకపోయిందని తెలిపారు. దీంతో మతిస్థిమితం లేకుండా పోయిందని కుటుంబ సభ్యులు కూడా తెలపడం జరిగిందని వారు తెలిపారు. ఎక్కడికి పోతాడో? ఎప్పుడు వస్తాడో? తెలియని పరిస్థితి ఉండేదని, దీంతో అనుకోకుండా రైల్వే పట్టాల వద్ద వచ్చి ఉండడంతో గుర్తు తెలియని రైలు ఢీకొట్టడం జరిగిందని తెలిపారు. కుటుంబ సభ్యులను విచారించి ఇది ఆత్మహత్యగా భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తదుపరి మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి సేవ పరీక్ష అనంతరం శవాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హిందూపురం జి ఆర్ పి పోలీసులు తెలిపారు. మృతునికి ముగ్గురు కుమార్తెలు ఒక కొడుకు ఉన్నాడని, కొడుకు జమ్మూ కాశ్మీర్లో ఆర్మీ లో ఉద్యోగం చేస్తున్నాడని వారు తెలిపారు. సమాచారాన్ని కొడుకుతోపాటు కుటుంబ సభ్యులు కూడా తెలియజేయడం జరిగిందని వారు తెలిపారు. మొత్తం మీద ఇంటిలో ఓ పెద్ద కుటుంబాన్ని పోగొట్టుకున్నామని కన్నీటి పర్యంతం అయ్యారు ఆ కుటుంబ సభ్యులు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img