ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ మాధవి
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని పాత ప్రభుత్వ ఆసుపత్రిలో దంతాలకు కూడా వైద్య చికిత్సలను నిర్వహించడం జరుగుతుందని ప్రభుత్వాసుపత్రి సూపర్డెంట్ మాధవి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దంతాల పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు వహించాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో దంతాలకు ప్రతి సోమ, బుధ, శుక్రవారాలలో మాత్రమే డాక్టర్ వివేకులాయపచే వైద్య చికిత్సలను అందించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా మా ఆసుపత్రిలో ఫిజియోథెరపీ కూడా ఉంటుందని, అవసరమైన రోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఓపి చూడబడునని తెలిపారు. అన్ని రకాల జబ్బులకు కూడా వైద్య చికిత్సలను సకాలంలో అందించి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరుగుతుందని వారు తెలిపారు. కావున ఈ అవకాశాన్ని పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.