ఎంఈఓ గోపాల్ నాయక్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం, మోడల్ కాలేజ్, బాలుర బాలికల జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులకు ఈనెల 23వ తేదీన పట్టణంలోని కోట మున్సిపల్ స్కూల్లో పాఠ్యపుస్తకాలు నోటు పుస్తకాలు ఇవ్వడం జరుగుతుందని ఎంఈఓ గోపాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటర్మీడియట్ ప్రభుత్వ విద్యార్థులకు కిట్టు రూపంలో ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు ధర్మవరం రూరల్, టౌన్ లో ఉండే 101 ప్రభుత్వ ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ఇప్పటికే పాఠ్యపుస్తకాలను ఇవ్వడం జరిగిందని వారు తెలియజేశారు. ఇంటర్మీడియట్ చదువుతున్న 847 మందికి పుస్తకాలు నోట్లు పంపిణీ చేయడంతో విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. వీటిని విద్యార్థులు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.