విశాలాంధ్ర -ధర్మవరం : రాష్ట్ర ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు పట్టణంలోని మార్కెట్ యార్డులో గల భద్రపరిచిన ఈవీఎం లను కలెక్టర్ అరుణ్ బాబు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల తర్వాత భద్రపరిచిన ఈవీఎం లను క్షుణ్ణంగా పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ అరుణ్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి విధిగా పరిశీలించాలన్న ఉత్తర్వులు మేరకు తాను రావడం జరిగిందని తెలిపారు. ఈ తనిఖీలు గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీ నాయకుల సమక్షంలో చేయడం జరిగిందని తెలిపారు. తదుపరి అక్కడి వివరాలను ఆర్డిఓ వెంకట శివరామిరెడ్డి ద్వారా తెలుసుకున్నారు. భద్రత పట్ల మరింత చొరవ చూపాలని డి.ఎస్.పి శ్రీనివాస్ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మార్వో రమేష్ సీఐ సుబ్రహ్మణ్యం, పుట్టపర్తి ఎన్నికల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.