హాకీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షులు.. సూర్య ప్రకాష్
విశాలాంధ్ర ధర్మవరం:: హాకీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టుకు జిల్లా క్రీడాకారులు ఎంపిక కావడం జరిగిందని హాకీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షులు, హాకీ శ్రీ సత్యసాయి జిల్లా జనరల్ సెక్రెటరీ సూర్యప్రకాష్ . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హాకీ ఇండియా ఆధ్వర్యంలో ఈనెల 10వ తేదీ నుండి 17వ తేదీ వరకు కడప జిల్లా పులివెందులలో జరగనున్న దక్షిణాది రాష్ట్రాల జూనియర్ బాలుర, బాలికల హాకీ ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టుకు శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన మహబూబ్బాషా పవిత్ర సింధు నసీమా ఎంపిక కావడం జరిగిందన్నారు. ఎంపికైన క్రీడాకారులను సూర్య ప్రకాష్ తోపాటు కాకి సత్యసాయి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు, సహకార దర్శి అరవింద్ గౌడ్,, జిల్లా హాకీ కోచ్ హసీన్ తదితరులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.