విశాలాంధ్ర ధర్మవరం:: మండల పరిధిలోని రైతులు తమ తమ పొలాల్లో వారిపై నార్లు నేరుగా నాటుకోకూడదని వ్యవసాయ అధికారి ముస్తఫా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖరీఫ్ వేరుశనగ పత్తిలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు. వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తలు తెలిపిన మాదిరిగా పంట విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకొని అధిక దిగుబడికి పంట వచ్చేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. చాలామంది రైతులు మిరప టమాటా వంగా లాంటి కూరగాయలు, పంటలు సాగులో నార్లను నేరుగా నాటడం వల్ల వివిధ రకాల వైరస్, తెగుళ్లు, చీడపీడలు ఆశించే ప్రమాదం ఉందన్నారు. నార్లు నాటుకునే ముందు తప్పనిసరిగా లీటరు నీటికి 2.5 మిల్లీ లీటర్లు క్లోరి వైరిపాస్, మూడు గ్రాముల కార్బన్డిజం కలిపిన ద్రావణంలో ముంచి నాటుకుంటే ఫలితాలు మెరుగ్గా ఉంటాయని తెలిపారు. ఇక ఖరీఫ్ కింద ముందస్తుగా అక్కడక్కడ సాగు చేసిన వేరుశెనగ పంట ప్రస్తుతం షాకీయ దశలో ఉన్నందున అంతర సేద్యం చేసుకోవాలని తెలిపారు. అలాగే రసం పీల్చే పురుగులు లద్దె పురుగు శనగపచ్చ పురుగు ఆశించడానికి అనుకూలమైన వాతావరణ ఉన్నందున నివారణ చర్యలను వెంటనే చేపట్టాలని తెలిపారు. పత్తి పంటలో రసం పిలిచే పురుగులు ఆశించే అవకాశం ఉందని తొలి దశలోనే లీటర్ నీటికి ఐదు మిల్లీమీటర్ల వేప నూనె లేదా ఐదు శాతం వేప గింజల కషాయాన్ని కలిపి పిచికారి చేయాలని తెలిపారు. పంటల విషయంలో తగిన సలహాలు సూచనలు కావలసినవారు రైతు భరోసా కేంద్రాలలో పొందవచ్చునని తెలిపారు. ఏ పంట వేసినా రైతులు ఆలోచించి, పంటలు వేసుకుంటే అధిక దిగుబడి వస్తుందని తెలిపారు.