విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని కొత్తపేటలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారు ఎనిమిదవ రోజు దుర్గా దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు సుదర్శన చార్యులు, అనిల్ కుమార్ ఆచార్యులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ, ట్రస్ట్ సభ్యులు మెటికల కుల్లాయప్ప, శంకర సంజీవులు, దత్త సాంబశివ, రంగా శ్రీనివాసులు, గుత్తి రామాంజనేయులు, నాగప్ప, సాగా సురేష్ తదితరులు పాల్గొన్నారు.
అదేవిధంగా రామ్ నగర్ లోని శ్రీ చౌడేశ్వరీ దేవి కట్టవద్ద గల శ్రీ చౌడేశ్వరీ దేవి ఘనంగా దసరా శరన్నవరాత్రుల వేడుకలు జరుపుకున్నారు. ఎనిమిదవ రోజు అమ్మవారు దుర్గాదేవి అలంకరణలో దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రామకృష్ణ, పూజారి గంగా ప్రసాద్, బాలు పెద్ద వెంకటేష్ రంగయ్య వరదరాజులు, మారుతి కుమార్, చింత ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
గాంధీనగర్ లోని శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో 33 వ శరన్నవరాత్రుల మహోత్సవ వేడుకలు అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. అమ్మవారు ఎనిమిదవ రోజున దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రంగం ఆదినారాయణ, కార్యదర్శి నీలూరి నారాయణస్వామి, కోశాధికారి లక్ష్మీ నరసింహులు, తదితర కమిటీ సభ్యులు భక్తాదులు పాల్గొన్నారు.
పట్టణంలోని కెపిటివీధిలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎనిమిదవ రోజున అమ్మవారు మీనాక్షి దేవి అలంకరణ లో భక్తాదులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు జూటూరి రమణయ్య వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్ గుప్తా కార్యదర్శి తబ్జుల శ్రీనివాసులు , ఆలయ కమిటీ చైర్మన్ పిన్ను శ్రీనివాస ప్రసాద్ తో పాటు అనుబంధ సంఘం ఆర్యవైశ్యులు, భక్తాదులో పాల్గొన్నారు.
పట్టణంలోని తొగట వీధిలో గల శ్రీ శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయంలో ఆలయ అభివృద్ధి సంఘం అధ్యక్షులు బంధనాథం వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి సిరివెళ్ల రాధాకృష్ణ ,కోశాధికారి వెంకటేశులు, (చిట్టి) తదితర సభ్యుల ఆధ్వర్యంలో శరన్నవరాత్రుల 41 వ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఎనిమిదవ రోజున అమ్మవారు రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనమిచ్చారు.పట్టణంలోని లక్ష్మీ నగర్- రాజేంద్రనగర్ లో గల శ్రీ రాజ్యలక్ష్మి చౌడేశ్వరి దేవి ఆలయంలో ఎనిమిదవ రోజున అమ్మవారు లలితా దేవి అలంకరణలో దర్శనమిచ్చారు.
పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో శరణ్య రాత్రుల మహోత్సవ వేడుకలు ఈవో వెంకటేశులు, భక్తాదులు, అర్చకులు నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారు ఎనిమిదవ రోజున దుర్గాదేవి అలంకరణలో భక్తాదులకు దర్శనమిచ్చారు. శాశ్వత వంశపారంపర్య ఉభయ దాతలు జగ్గా వంశీయులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తాదులు పాల్గొన్నారు.
పట్టణంలోని దుర్గమ్మ తల్లి ఆలయంలో దసరా శరన్నవరాత్రుల మహోత్సవ వేడుకలు ఆలయ ఈవో వెంకటేశులు, భక్తాదులు నడుమ అంగరంగ వైభవంగా జరిగాయి. రోజున అమ్మవారు ప్రత్యేక అలంకరణ గావించి, ప్రత్యేక పూజలు నిర్వహించి, పెద్ద ఎత్తున చండీ హోమం నిర్వహించారు. ఈ చండీ హోమం ఆలయ ఈవో వెంకటేశులు, దాతలు భక్తాదులు నడుమ, వేదమంత్రాలు మంగళ వాయిద్యాలు నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు.
పట్టణములోని శ్రీనివాస నగర్ (గుడ్డి బావి వీధిలో) గల శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయములో ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవ వేడుకలో ఎనిమిదవ రోజు లక్ష్మీ ధన్వంతరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చెన్నం శెట్టి జగదీశ్వర ప్రసాద్, చెన్నం శెట్టి రమేష్ కుమార్, జింక రాజేంద్రప్రసాద్, చెన్నం శెట్టి శ్రీనివాసులు, అర్చకులు రాజేష్ ఆచార్యులు, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.
పట్టణంలోని కొత్తపేటలో గల టీచర్స్ కాలనీలో శ్రీ మహాలక్ష్మి చౌడేశ్వరి దేవి ఆలయంలో శరన్నవరాత్రుల మహోత్సవ వేడుకలు ఆలయ కమిటీ, ఆధ్వర్యంలో ఎనిమిదవ రోజు అమ్మవారు మహా కాలరాత్రి దేవి అలంకరణలో భక్తాదుల కు దర్శనం ఇచ్చారు.
పట్టణంలోని సాలే వీధిలో గల పుట్లమాంబ దేవి ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలోఅర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అమ్మవారు దేవి ఎనిమిదవ రోజు మహాలక్ష్మి దేవి అలంకరణములో భక్తాదులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ గిర్రాజు ప్రసాద్, గిర్రాజు నగేష్, కోటమ్ రవి తదితరులు పాల్గొన్నారు.
పట్టణములోని శివానగర్, కేశవ నగర్ లలో వెలసిన శ్రీ విజయ చౌడేశ్వరి దేవి ఆలయంలో శరన్నవ రాత్రుల మహోత్సవ వేడుకలు లో భాగంగా అమ్మవారు భాగంగా ఎనిమిదవ రోజు దుర్గాదేవి అలంకరణలో భక్తాదులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ సేవా కార్యకర్తలు పాల్గొన్నారు..
పట్టణములోని సాలే వీధిలో గల పెద్దమ్మ తల్లి ఆలయంలో ఎనిమిదవరోజు అమ్మవారు దుర్గా దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. కమిటీ దాతల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కమిటీ వారు తెలిపారు.
పట్టణంలోని సాలే వీధిలో గల అంబా భవాని దేవాలయంలో ఎనిమిదవ రోజు అమ్మవారు దుర్గా దేవి అలంకరణములో భక్తాదులకు దర్శనమిచ్చారు. ఈ నిర్వహణ స్వకుల సాలే సమాజము, స్వకుల సాలే మహిళా మండలి, అంబా భవాని దేవి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు.
పట్టణములోని యాదవ వీధిలో గల గాయత్రీ దేవాలయంలో ఎనిమిదవ రోజు అమ్మవారు దుర్గాదేవి అలంకరణములో భక్తాదులకు దర్శనమిచ్చారు. ఈ వేడుకలు దాతలు, భక్తాదులు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చక సంక్షేమ సంఘం, గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం, వేద మాత గాయత్రీ దేవి ఆలయ కమిటీ వారు నిర్వహించారు.