డిప్యూటీ తాసిల్దార్ ఈశ్వరయ్య
విశాలాంధ్ర -ధర్మవరం:: సమాచార హక్కు పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని డిప్యూటీ తాసిల్దార్ ఈశ్వరయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ఎన్జీవో హోం లో ఏర్పాటుచేసిన సమాచార హక్కు ప్రజా సంరక్షణ వేదికకు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలకు పూర్తి దశలో సమాచార హక్కు పై అవగాహన కల్పించినప్పుడే అందరికీ తగిన న్యాయం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా సమాచార హక్కు చట్టంపై పూర్తిగా వివరించడం జరిగిందని వారు తెలిపారు. సమాచార హక్కు పై ఏ సమాచారాన్ని అయినా అన్ని ప్రభుత్వ విభాగం కార్యాలయాల ద్వారా కూడా పొందవచ్చునని తెలిపారు. అదేవిధంగా పట్టణ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగిందని వారు తెలిపారు. తదుపరి సమాచార హక్కు ప్రజా సంరక్షణ వేదిక జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు, జిల్లా ఉపాధ్యక్షులు గోపి పాల్గొన్నారు. అనంతరం వారు సమాచార హక్కు ప్రజా సంరక్షణలో పాటించవలసిన విధి విధానాలు, ప్రజలకు చేయాల్సిన న్యాయ చట్టాలపై వారు వివరణ ఇచ్చారు. అనంతరం జిల్లా కమిటీ పట్టణ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో డివిజన్ అధ్యక్షులుగా చెన్నా శ్రీనివాసులు, ఉపాధ్యక్షులుగా హాజ్ వలి, ధర్మవరం అధ్యక్షులుగా సోలిగాల్లకొండప్ప, ఉపాధ్యక్షులుగా షామీర్ భాషను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా, పట్టణ డివిజన్ కమిటీ వారు పాల్గొన్నారు.