విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ కే హెచ్ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ల గడువు పొడిగించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ
డిగ్రీ కళాశాలలో చేరునటువంటి విద్యార్థినీ విద్యార్థులకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువు ఈనెల 20వ తేదీ వరకు వరకు పొడగించడం జరిగింది అన్నారు. వెబ్ ఆప్షన్ ఇచ్చు కోవడం కోసం ఈనెల 23 నుండి 26వ తేదీ వరకు ఖరారు చేయడం జరిగింది అన్నారు. 31వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది అన్నారు.
.కే.హెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంటర్ పాస్ అయిన విద్యార్థులను దరఖాస్తు చేసుకోవడానికి ఆహ్వానిస్తోంది అని అన్నారు. విద్యార్థుల భవితవ్యం తీర్చిదిద్దితూ అధ్యాపకులు మారుతున్న కాలానికి అనుగుణంగా ఉత్తమ విద్యా బోధన అందిస్తున్నారు. బోధనతో పాటు వివిధ రకాలైన పోటీ పరీక్షలకు కూడా సంసిద్దం చేయడం జరుగుతుందన్నారు. ఆధునిక కంప్యూటర్ ల్యాబ్, అత్యాధునికమైన సౌకర్యాలతో కూడిన జిమ్, విశాలమైన క్రీడా మైదానం కలిగిఉన్నది అని,విద్యార్థులకు వసతిగృహం (హాస్టల్) సదుపాయం, ఆర్టీసీ బస్సు సౌకర్యం కలదు అని తెలిపారు.ఆసక్తి కలిగిన విద్యార్థినీ, విద్యార్థులు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కళాశాలలో చేరి తమ భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుకోగలరని తెలిపారు.