విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని సంజయ్ నగర్ లో గల బిఎస్సార్ మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాల యందు సేవా భారతి ఆధ్వర్యంలో ఆసక్తిగల విద్యార్థులందరికీ కరాటే, సూర్య నమస్కారాలు, కబాడీ పోటీలు, కర్ర సామూలను ఉచితంగా నిర్వహిస్తున్నట్లు దాసరి శేఖర పేర్కొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం 6:15 నిమిషాల నుండి 7:15 నిమిషాల వరకు నేర్పించబడునని తెలిపారు. పది సంవత్సరములు వయసు నుంచి ఆపై వయసు ఉన్న వారందరికీ కూడా ఈ క్రీడలు నేర్పించబడినది తెలిపారు. చదువుతోపాటు క్రీడలు కూడా ఎంతో ఆరోగ్యాన్ని, ఉత్సాహాన్ని ఇస్తాయని తెలిపారు. కావున తల్లిదండ్రులు తమ పిల్లలను పంపి, ఇటువంటి అవకాశం సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 9966521652 కు సంప్రదించాలని తెలిపారు.