విశాలాంధ్ర- ధర్మవరం: మండల పరిధిలోని గొట్లూరు పంచాయితీ ఎస్సీ కాలనీలోని నల్లాలమ్మ దైవస్థానంను ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ చొరవతో తిరిగి తెరవబడింది. గత ప్రభుత్వ హయాంలో దేవస్థానాన్ని అక్రమంగా కొంతమంది ఆధిపత్యం కోసం, పోలీస్ డిపార్ట్మెంట్ ని అడ్డం పెట్టుకుని గత నాలుగు సంవత్సరాలుగా గుడిని మూసివేయడం జరిగింది. దీని కారణంగా దేవాలయం మూతపడడంతో గ్రామస్తులు అమ్మవారి దర్శనం లేక తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఆంధ్రపదేశ్ ఆరోగ్యశాఖ మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ గ్రామ పెద్దలు ప్రజలు సంప్రదించగా వెంటనే ఆయన కార్యాలయ సిబ్బందితో, గ్రామ పెద్దలతో చర్చించి, దేవస్థానాన్ని తెరిచేలా చర్యలు తీసుకున్నారు. దీనివల్ల అమ్మవారికి నిత్యం పూజలు అందుకునేలా చేయించడం జరిగింది. తమ గ్రామ దేవత నల్లాలమ్మ ఆలయం తిరిగి తెరవబడడం అమ్మవారు మళ్లీ పూజలు అందుకోవడం తమకు ఎంతో సంతోషంగా ఉందనిగ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు మంత్రి సత్యకుమార్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. దైవకార్యాన్ని జరిపించడానికి చొరవ తీసుకున్న మంత్రికు నల్లలమ్మ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని , తమ సమస్యను పరిష్కరించినందుకు గ్రామస్తులు సత్యకుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.