ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్
విశాలాంధ్ర -ధర్మవరం : ధర్మవరం పట్టణంలోని కోర్టులో గల న్యాయవాదుల యొక్క సమస్యలను తప్పక పరిష్కరించేందుకు కృషి చేస్తానని ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు.. ఈ సందర్భంగా కోర్టు బార్ అసోసియేషన్ సభ్యులు తమ సమస్యలను విన్నవించుకున్నారు. అనంతరం పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ రానున్న కాలంలో బార్ అసోసియేషన్ లో సమస్యలన్నింటిని పరిష్కరించే తీరుతానని వారు హామీ ఇచ్చారు. అందరి సహాయ సహకారాలతో పరిష్కరించుకున్నప్పుడే అందరికీ తగిన న్యాయం కూడా జరుగుతుందని వారు భరోసా ఇచ్చారు. తదుపరి పరిటాల శ్రీరాములు బార్ అసోసియేషన్ వారు న్యాయవాదులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ వారితోపాటు సీనియర్, జూనియర్, న్యాయవాదులు పాల్గొన్నారు.