ఏపీ ఎస్ ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండి శివ
విశాలాంధ్ర -ధర్మవరం: పట్టణంలోని పలు ప్రైవేట్ పాఠశాలలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏపీఎస్ఎఫ్ శ్రీ సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి బండి శివ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని పలు జూనియర్ కళాశాలలో మౌలిక సదుపాయాలు లేవు అని, సొంత భవనాలు క్రీడా మైదానము టాయిలెట్స్ బండి పార్కింగ్ లేదు అని తెలిపారు. అంతేకాకుండా అర్హత లేని అధ్యాపకులు తో బోధన చేయిస్తున్నారని తెలిపారు. విద్యార్థులతో వేలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారని బస్సు సౌకర్యంతో వేలాది రూపాయలను వేద విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వసూలు చేయడం దారుణం అని తెలిపారు. విద్యాశాఖ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా విచ్చలవిడిగా విద్యార్థుల తల్లిదండ్రులను మభ్యపెడుతూ మోసపూరిత ప్రకటనలతో జూనియర్ కళాశాలలు పాటుపడుతున్నాయని తెలిపారు. జూనియర్ కళాశాలలపై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడదామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పవన్, రమేష్, ప్రకాష్, రాజు, ప్రదీప్, కిషోర్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.