మండల వ్యవసాయ అధికారి ముస్తఫా
విశాలాంధ్ర- ధర్మవరం:: మండల పరిధిలోని రైతులకు కంది విత్తనాలను అందుబాటులో ఉంచడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి ముస్తఫా తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ మండల వ్యాప్తంగా ఇంతవరకు 4139 మంది రైతులకు గాను 3800 కుంటాల వేరుశనగలు పంపిణీ చేయడం జరిగింది అన్నారు. అదేవిధంగా కందులు అవసరమైన రైతులు రైతు భరోసా కేంద్రాలలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపారు. నాలుగు కేజీల ప్యాకెట్లు అందుబాటులో కలవని, సబ్సిడీ ధరపోను రైతులు 392 రూపాయలు ప్యాకెట్ కు చెల్లించాలని తెలిపారు. కావున ఇటువంటి అవకాశాన్ని మండల రైతులు సద్వినియోగం చేసుకొని, కంది పంటలు అధిక దిగుబడిని సాధించాలని తెలిపారు.