Friday, October 25, 2024
Friday, October 25, 2024

ఏబీవీపీ ఆధ్వర్యంలో జాతీయ విద్యార్థి దినోత్సవం వేడుకలు

విశాలాంధ్ర ధర్మవరం; అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సత్య సాయి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏబీవీపీ 76వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ వాసుదేవ మాట్లాడుతూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ ) 75 సంవత్సరాలుగా విద్యార్థుల కోసం దేశం కోసం ఏబీవీపీ కార్యకర్తలు క్షణం, క్షణం మా కణం, క్షణం భరతమాతకే సమర్పణం అంటూ దేశ రక్షణ కోసం పనిచేస్తున్నటువంటి దేశభక్తి కలిగినటువంటి ఏకైక ఆర్గనైజేషన్ ఏబీవీపీ విద్యార్థి సమస్యలకై ఏబీవీపీ అలుపెరుగని పోరాటం చేస్తుంది అని ఏబీవీపీ నాయకులు తెలిపారు. అలాంటి ఏబీవీపీలో ప్రతి విద్యార్థి పనిచేయాలని అలాగే విద్యార్థులందరికీ జాతీయ విద్యార్థి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం నగర కార్యదర్శి శ్రీనివాసులు, నగర సంయుక్త కార్యదర్శి చైతన్య, ఎస్ ఎఫ్ డి కన్వీనర్ హరి ప్రసాద్, ఏబీవీపీ నాయకులు కార్తీక్, శశి, వినయ్, గిరి, డి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img