డిపో మేనేజర్ సత్యనారాయణ
విశాలాంధ్ర ధర్మవరం;; ఆర్టీసీ ఆదాయానికి ప్రయాణికులే కీలకపాత్ర వహిస్తారని డిపో మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మవరం డిపో నుండి దూర ప్రాంతాలకు, పుణ్యక్షేత్రాలకు ప్రతిరోజు సర్వీస్ను నడుపుతున్నట్లు వారు తెలిపారు. ఇందులో భాగంగా ధర్మారం నుండి తిరుపతికి తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు, శ్రీశైలం కు రెండు బస్సులు నడుపుతున్నామని ఇందులో తెల్లవారుజామున నాలుగున్నరకు ఒక బస్సు, రెండవ బస్సు ఉదయం 7:15 నిమిషాలకు, నంద్యాలకు రెండు బస్సులు లలో ఉదయం 5 గంటలకు, ఆరున్నర గంటలకు కలవని, కర్నూలుకు మూడు బస్సులు నడుపుతున్నామని తెలిపారు. హైదరాబాదుకు ఉదయం 11 గంటలకు, స్పెషల్ బస్సులు మూడు, సాయంత్రం 6:30 గంటలకు, రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్ బస్సును నడుపుతున్నామని తెలిపారు. అదేవిధంగా ధర్మారం నుండి అనంతపురానికి ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు, గోరంట్లకు కూడా 10 నిమిషాలకు ఒక బస్సు, పులివెందులకు అర్థగంటకు ఒకసారి బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. దూరప్రాంతాలకు ఆన్లైన్లో గాని, రిజర్వేషన్ కౌంటర్ వద్ద గాని ప్రయాణికులు రిజర్వేషన్ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకొని ధర్మవరం ఆర్టీసీ డిపోకు మరింత ఆదాయాన్ని పెంచాలని వారు తెలిపారు.