డి ఐ ఈ ఓ కు వినతి పత్రం.. ఏపీ ఎస్ ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండి శివ
విశాలాంధ్ర ధర్మవరం:: ధర్మవరం పట్టణంలో పలు ప్రైవేట్ జూనియర్ కళాశాలలో మౌలిక వసతులు లేకపోవడంతో, అనేక ఇబ్బందులు విద్యార్థులు ఎదుర్కొంటున్నారని, వెంటనే ఆయా కళాశాలలపై చర్యలు చేపట్టాలని కోరుతూ డి ఐ ఈ ఓ కు, ఏవో మారుతి కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం శివ మాట్లాడుతూ పట్టణంలోని పలు జూనియర్ కళాశాలల పేర్లను వినతి పత్రంలో ఇవ్వడం జరిగిందని, మౌనిక సదుపాయాలు లేవు అని, సొంత భవనం, క్రీడా మైదానం, టాయిలెట్స్, బండి పార్కింగ్ లేవని తెలిపారు. అంతేకాకుండా విద్యార్థులకు బోధించాల్సిన అధ్యాపకులు అర్హత కూడా లేని వారిని నియమించడం దారుణం అన్నారు. అంతేకాకుండా అధిక ఫీజులు వసూలు చేస్తూ, బస్సు సౌకర్యం ఉందని తెలుపుతూ కూడా వేలాది రూపాయలు పేద విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వసూలు చేయడం దారుణమన్నారు. ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా విచ్చలవిడిగా విద్యార్థుల తల్లిదండ్రులను మభ్యపెడుతూ, దోచుకోవడం దారుణమని తెలిపారు. చేనేతకు ప్రముఖ స్థానం ఉన్న ధర్మారంలో చేనేత కార్మికుల పిల్లలు కూడా ప్రైవేటు జూనియర్ కళాశాలలో చదువుతున్నారని వారు గుర్తు చేశారు. బస్సు ఫీజు విషయంలో అధికంగా వసూలు చేయడం న్యాయబద్ధం కాదని వారు హితవు పలికారు. వెంటనే తాము తెలిపిన ప్రైవేటు జూనియర్ కళాశాలలో అధికారులుగా చర్యలు తీసుకోవాలని లేనియెడల పెద్ద ఎత్తున ఉద్యమాలను లేవదీస్తావని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు స్వామి, నవీన్, ఉదయ రెడ్డి, పవన్ తదితరులు పాల్గొన్నారు.