విశాలాంద్ర ధర్మవరం:: ఆర్టీసీ ఆదాయమే ఉద్యోగుల ప్రగతికి మూలం అవుతుందని డిపో మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డిపోలో కండక్టర్ భయపరెడ్డి, జిపిఎన్ రెడ్డి- డ్రైవర్, ఎస్వీ. రమణ- కండక్టర్, అజీజ్- ఏ డి సి పదవీ విరమణ సందర్భంగా అభినందన సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగ విధులలో ఆర్టీసీకి పదవీ విరమణ వారందరూ కూడా ఎన్నో సేవలు అందించి మంచి గుర్తింపు పొందడం పట్ల, వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. వీరి శేష జీవితం సుఖసంతోషాలతో కుటుంబ సభ్యులతో ఆయురారోగ్యాలతో వెలసిల్లాలని వారు ఆకాంక్షించారు. అనంతరం తోటి ఉద్యోగస్తులు కూడా పదవీ విరమణ గావింపబడిన వారిని తమదైన శైలిలో ప్రసంగిస్తూ వారికి కృతజ్ఞతలను తెలియజేశా రు. అనంతరం డిపో మేనేజర్ తో పాటు డిప్యూటీ సూపర్డెంట్ ప్రేమ్ కుమార్, ఏఈ. సికిందర్, టి, ఐ-3 శ్రీరాములు, డిపో సీనియర్ ఇన్స్పెక్టర్ పెద్దన్న, ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు నాగార్జున రెడ్డి, నేషనల్ మజ్దూర్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ముత్యాలప్ప ఎడిసి మేడాపురం నరసింహులు, ఎస్ ఎం. సాహెబ్, ఎంప్లాయిస్ యూనియన్ రీజినల్ నాయకులు బి.నర్సింలు, ఆర్వి లక్ష్మి, డిపో కార్యదర్శి ముస్తఫా, రిటైర్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు తోటి ఉద్యోగస్తులు కలిసి పదవి విరమణ పొందిన వారిని ఘనంగా సత్కరించారు.