విశాలాంధ్ర-చిలమత్తూర్ రూరల్ ( శ్రీ సత్య సాయి జిల్లా) : చిలమత్తూర్ పంచాయతీ పరిధిలోని ఆదేపల్లి గ్రామంలో సోమవారం పుట్ట గొడుగులు తిని ఏడు మంది అస్వస్థకు గురైన సంఘటన చోటుచేసుకుంది, గ్రామస్తులు తెలిపిన వివరాలు, అదే పల్లి గ్రామ వాసి అయిన వెంకటస్వామి పుట్టగొడుగులు తీసుకొని వచ్చి వాటిని గృహంలో ఉదయం ఆహారముగా వండుకొని కుటుంబ సభ్యులందరూ భుజించగా, శ్రీనివాసులు, రంగప్ప, అలివేలమ్మ, లక్ష్మి, ఆదినారాయణ , శాంతమ్మలు వాంతులు చేసుకోవడంతో, విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆటోలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, డాక్టర్ తేజస్విని ప్రథమ చికిత్సలు చేసి, మెరుగైన చికిత్స కోసం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.