విశాలాంధ్ర -ధర్మవరం:: ఈనెల 21వ తేదీ పౌర్ణమి సందర్భంగా అరుణాచలం, గిరి ప్రదర్శన, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనార్థం ఆర్టీసీ బస్సును ఏర్పాటు చేయడం జరిగిందని డిపో మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈనెల 20వ తేదీ ఉదయం 6 గంటలకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని రాను పోను చార్జీలు రూ.1,400 ఉంటుందని తెలిపారు. దర్శనానికి వెళ్లవలసిన భక్తాదులు ఆన్లైన్లో గాని బస్టాండ్ రిజర్వేషన్ కౌంటర్లో గాని సీట్లు రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కలదని తెలిపారు.”భగవంతుని సేవలో భక్తులు! భక్తుల సేవలో ఏపీఎస్ఆర్టీసీ ఎల్లప్పుడూ ముందు ఉంటుందని వారు తెలియజేశారు. ఈ అవకాశాన్ని భక్తాదులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 6303151302 కు గాని 9959225859 సెల్ నెంబర్లకు సంప్రదించవచ్చునని తెలిపారు.