లైన్స్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఈనెల 23వ తేదీ ఆదివారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు లైన్స్ క్లబ్ వారిచే ఉచిత కంటి చికిత్స శిబిరమును నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు గూడూరు మోహన్ దాస్, కోశాధికారి వేణుగోపాల చార్యులు, కార్యదర్శి రాజగోపాల్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ లయన్స్ కంటి ఆసుపత్రి వ్యవస్థాపకులు వెంకటస్వామి ఆదేశాల మేరకు ఈ శిబిరమును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యఅతిథిగా టూ టౌన్ సిఐ అశోక్ కుమార్, ముఖ్య వక్తగా లయన్ పళ్లెం వేణుగోపాల్ చార్టర్ర్ నెంబర్ రానున్నట్లు వారు తెలిపారు. ఈ శిబిరానికి దాతగా కీర్తిశేషులు కాచర్ల హనుమంతు జ్ఞాపకార్థం వీరి కుమారులు కాచర్ల నాగరాజు వ్యవహరించడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే లైన్స్ క్లబ్ ద్వారా వేలాదిమందికి కంటి ఆపరేషన్లను నిర్వహించామని, ఉచితంగా కంటి అద్దాలను కూడా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ధర్మవరం పట్టణంలోని ఎర్రగుంటలో లయన్స్ కంటి ఆసుపత్రి యందే కంటి ఆపరేషన్లను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో గల పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.