విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ప్రభుత్వ బాలుర క్రీడా మైదానంలో రెండవ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హాకీ పోటీలు హోరాహోరీగా జరిగాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి హాకీ క్రీడాకారులు పాల్గొని తమ సత్తాను చాటుతున్నారు. మొదటి రోజున ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక మధుసూదన్ రెడ్డి ప్రారంభించడం జరిగింది. తదుపరి రెండవ రోజు ఏడు జ ట్లు తలపడ్డాయి. ఇందులో తిరుపతి వర్సెస్ నంద్యాల పోటీ పడగా తిరుపతి ఐదు గోల్స్, నంద్యాల ఒక గోల్, వైయస్సార్-శ్రీకాకుళం 5-1, పుట్టపర్తి-నెల్లూరు 7-1, గుంటూరు-కర్నూల్ 2-0, అనంతపురం-ఎన్టీఆర్ జిల్లా 5-3, అనకాపల్లి-ఏలూరు 12-0, కడప-నంద్యాల 4-1, సత్యసాయి జిల్లా-గుంటూరు జిల్లా3-1
రావడం జరిగిందన్నారు.విజేతలైన వారిని శ్రీ సత్య సాయి జిల్లా హాకీ కమిటీ వారు అభినందించారు. రెండవ రోజు హాకీ పోటీలకు ముఖ్య అతిథులుగా చేనేత పారిశ్రామికవేత్త బిజెపి నాయకుడు జింక రామాంజనేయులు, టిడిపి పట్టణ అధ్యక్షుడు పరిసే సుధాకర్ క్రీడాకారులతో గౌరవ వందనం తీసుకొని, వారికి శుభాకాంక్షలు తెలియజేసి పోటీలను ప్రారంభింపజేశారు. అనంతరం ముఖ్య అతిథులను వైస్ ప్రెసిడెంట్, హాకీ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి శ్రీ సత్య సాయి జిల్లా సూర్యప్రకాష్, హాకీ జిల్లా సహాయ కార్యదర్శి అరవిందు గౌడ్ జిల్లా ఉపాధ్యక్షులు గౌరీ ప్రసాద్, మారుతి , అమ్ముద్దీన్, కిరణ్, కోచ్ హేసెన్ తదితరులు శాలువా, పూలమాల, జ్ఞాపకతో ఘనంగా సన్మానించారు. సూర్య ప్రకాష్ మాట్లాడుతూ ఈ రాష్ట్ర హాకీ పోటీలు నిర్వహించడం మాకెంతో సంతోషంగా ఉందని, ఎంతోమంది దాతలు ప్రత్యక్షంగా, పరోక్షంగా తమ సహాయ సహకారాలను అందించి విజయవంతం చేయుటలో వారి పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. ఈ పోటీలు 30వ తేదీ వరకు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల పిడీలు, పి ఈ టి లు, హాకీ క్రీడాకారులు పాల్గొన్నారు.