— జిల్లా ఎస్పీ పి.జగదీష్
విశాలాంధ్ర అనంతపురం : వాల్మీకి మహర్షి చేసిన బోధనలు ఇప్పటి సమాజానికి చాలా అవసరమని జిల్లా ఎస్పీ పి.జగదీష్ అభిప్రాయపడ్డారు. తండ్రీ కొడుకుల బంధం, అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల అనురాగాలను వాల్మీకి మహర్షి రామాయణంలో వర్ణించిన తీరు అద్వితీయమని పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడారు. రామాయణం శ్రీరాముల వారి చరిత్రను తెలియజేయడంతో పాటు పరిపూర్ణమైన మానవ జీవితానికి నిలువెత్తు నిదర్శనమన్నారు. ఆయన ఆదర్శాలను మార్గదర్శకాలుగా చేసుకుని జీవిద్దామని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ డి.వి.రమణమూర్తి, ఏ.ఆర్ అదనపు ఎస్పీ జి.మునిరాజ, ఎస్బీ సి.ఐ లు ధరణీ కిశోర్, క్రాంతికుమార్, ఆర్ ఐ లు రెడ్డెప్పరెడ్డి, మధు, జిల్లా పోలీసు కార్యాలయం ఏ.ఓ శంకర్, సూపరింటెండెంట్లు ప్రసాద్, సావిత్రమ్మ, ఎస్పీ సిసి ఆంజనేయ ప్రసాద్, జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోక్ నాథ్, గాండ్ల హరినాథ్, లక్ష్మినారాయణ, తదితరులు పాల్గొన్నారు.