ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ
విశాలాంధ్ర -శింగనమల : ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్,ఎమ్మెల్యే బాలకృష్ణ ల పై మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు ను శింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ తీవ్రంగా ఖండించారు,ఎమ్మెల్యే శ్రావణి శ్రీ మాట్లాడుతూ అధికారం కోల్పోతానే పిచ్చి పట్టి గోరంట్ల మాధవ్ మాట్లాడుతున్నారని, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిదన్నారు,గత ఐదు సంవత్సరాలలో నువ్వు హిందూపురం పార్లమెంటుకు ఏం చేసావో చెప్పాలని,నువ్వు చేసిన అవినీతి అక్రమాల వల్లనే కనీసం నీకు 2024 లో వైసిపి పార్టీ టికెట్ కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. గత ఐదు సంవత్సరాలలో ఏ రోజు బయటికి వచ్చి ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడిన సంఘటనలు లేవని,ఇప్పుడు వచ్చి మాట్లాడే అర్హత మీకు లేదన్నారు.రాష్ట్రంలో మహిళలు,బాలికల పై జరుగుతున్న అఘాయిత్యాల పై ప్రభుత్వం వెంటనే నిందితులను అరెస్టు చేసి,కఠినంగా శిక్షించేందుకు చర్యలు చేపట్టారని తెలిపారు.రాష్ట్రంలో మహిళలు,బాలికలను ఎలా కాపాడుకోవాలో మా ప్రభుత్వానికి తెలుసని ధ్వజమెత్తారు.