Monday, May 20, 2024
Monday, May 20, 2024

సీపీఐ అభ్యర్థి అత్తిలి విమల విస్తృత ప్రచారం

విశాలాంధ్ర-విశాఖ : విశాఖ పశ్చిమ నియోజకవర్గ సీపీఐ ఎమ్మెల్యే అభ్యర్థి అత్తిలి విమల మంగళవారం ఎన్‌ఎస్‌టీఎల్‌, శాంతినగర్‌ అపార్టుమెంట్‌లలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ రంగ పరిశ్రమల మనుగడ, అధిక ధరల నియంత్రణ ఇండియా కూటమిలోని సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించడం ద్వారానే సాధ్యపడుతుందని విమల ఓటర్లకు వివరించారు. రాష్ట్రానికి రాజధాని కావాలన్నా, పోలవరం నిర్మాణం పూర్తి కావాలన్నా ఇండియా కూటమి అధికారంలోకి రావాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వామపక్ష పార్టీలు నిరంతరం ఉద్యమాలు చేస్తున్నాయని తెలిపారు. ఈ సీపీఐ అభ్యర్థి అత్తిలి విమల విస్తృత ప్రచారం కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పి.చంద్రశేఖర్‌, సీపీఐ అనకాపల్లి జిల్లా సహాయ కార్యదర్శి రాజన దొరబాబు, నాయకులు ఎండీ బేగం, సుబ్బలక్ష్మి, నల్లయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీహరిపురం ఏరియాలో జరిగిన ప్రచారంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు సీహెచ్‌ రాఘవేంద్రరావు మాట్లాడుతూ ప్రభుత్వం రంగ సంస్థలు మనుగడ సాగించాలంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఓడిరచి ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సీపీఐ అభ్యర్థి అత్తిలి విమలకు కంకికొడవలి గుర్తుపై, విశాఖ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి పి.సత్యారెడ్డికి హస్తం గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా నాయకుడు దాకారపు నూకరాజు, ఎర్రయ్య, రమణ, శ్రీను, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు, కార్యవర్గ సభ్యులు కె.సత్యాంజనేయ, జి.రాంబాబు, కె.వనజాక్షి, పి.సూర్య పద్మ, గండి అప్పారావు, విద్యార్థి, యువజన నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img