విశాలాంధ్ర,సీతానగరం: అన్ని వర్గాల కుటుంబ సభ్యుల అవసరాలను గుర్తించి వారికి జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా మేలు చేకూర్చడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ఎంపిడిఓ ఎం ఎల్ ఎన్ ప్రసాద్ తెలిపారు.శనివారం సూరమ్మపేట గ్రామసచివాలయం వద్దజగనన్న సురక్ష క్యాంపు కార్యక్రమము జరిగింది.జగనన్న సురక్ష క్యాంప్ ద్వారా అర్జీ పెట్టుకున్న అర్హులకు మంజూరు కాబడిన 11రకాల సేవలకు చెందిన దృవీకరణ పత్రాలను పార్టీఅధ్యక్షుడు బొంగు చిట్టిరాజు చేతుల మీదుగా ఆర్జీదారులకు అందజేసారు.కులధృవీకరణ,ఆదాయ,జనన, కుటుంబ , మరణ ధృవీకరణ, కొత్త రైస్ కార్డులు, వివాహా ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఈకార్యక్రమంలో జగనన్న సురక్ష కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశంను ప్రజలకుఎంపిడిఓ ఎం ఎల్ ఎన్ ప్రసాద్, పార్టీ అధ్యక్షుడు బొంగు చిట్టి రాజులు తెలిపారు.ఈకార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు బొంగు చిట్టిరాజు, సర్పంచ్ సాంబన్నదొర, ఉప సర్పంచ్ ఎస్.ఈశ్వరరావు, సహకార సంఘం అధ్యక్షుడు మండల త్రినాథ రావు, బొంగు హేమ సుందర నారాయణ, బంకురు రమేష్,ఆర్.ఐ శ్రీనివాసరావు,ఎంఈఓ సూరిదేముడు, వెలుగు ఏపిఎం శ్రీరాములు, ఉపాధి ఏపిఓ భాను,నాయకులు పోల ఈశ్వర నారాయణ, మర్రాపుదనం,సెక్రటరీ సంతోష్ కుమార్,విఆర్ఓ పాణీ,సచివాలయం ఉద్యోగులు, అంగన్వాడి సిబ్బంది, వైద్య సిబ్బంది,పంచాయతీ వాలంటీర్లు, సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు, స్థానిక ప్రజలు, లబ్దిదారులు
తామరఖండిలో…..
అన్ని వర్గాల కుటుంబ సభ్యుల అవసరాలను గుర్తించి వారికి జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా మేలు చేకూర్చడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని తహశీల్దార్ ఎన్వీ రమణ తెలిపారు.శనివారం తామర ఖండి గ్రామసచివాలయం వద్దజగనన్న సురక్ష క్యాంపు కార్యక్రమము జరిగింది.జగనన్న సురక్ష క్యాంప్ ద్వారా అర్జీ పెట్టుకున్న అర్హులకు మంజూరు కాబడిన 11రకాల సేవలకు చెందిన దృవీకరణ పత్రాలను జడ్పీటీసీ బాబ్జి , ఎంపిపి ప్రతినిది బలగ శ్రీరాములు నాయుడు, ఎంపిటిసి శ్రీనివాసరావులచేతుల మీదుగా ఆర్జీదారులకు అందజేసారు.కులధృవీకరణ,ఆదాయ,జనన, కుటుంబ , మరణ ధృవీకరణ, కొత్త రైస్ కార్డులు, వివాహా ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఈకార్యక్రమంలో జగనన్న సురక్ష కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశంను ప్రజలకు అధికారులు,నాయకులు తెలిపారు.ఈకార్యక్రమంలో ఈఓపిఆర్డీ వర్మ, ఎంఈఓ వెంకటరమణ,పార్టీ అధ్యక్షులు బొంగు చిట్టిరాజు,సర్పంచులు లలిత,అప్పారావు,సహకార సంఘం అధ్యక్షుడు మన్మధరావు, ఎంఈఓ సూరిదేముడు, వెలుగు ఏపిఎం శ్రీరాములు,సచివాలయం ఉద్యోగులు, అంగన్వాడి సిబ్బంది, వైద్య సిబ్బంది,పంచాయతీ వాలంటీర్లు, సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు, స్థానిక ప్రజలు, లబ్దిదారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఈనెల1నుండి ప్రారంభ మైన జగనన్న సురక్ష శనివారంతో ముగిసినట్టు తహశీల్దార్ ఎన్వీ రమణ, ఎంపిడిఓ ప్రసాదులు తెలిపారు.