Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

రోడ్లు మరమ్మత్తులు కాకుండా పూర్తి పనులు చేయాలి

విజయనగరం జిల్లా- రాజాం : రాజాం నియోజకవర్గంలో రోడ్లు మరమ్మత్తు గురించి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కంబాల రాజవర్ధన తీవ్రంగా విమర్శించారు. గత పది సంవత్సరాలలో ఒకసారి ప్రతిపక్షంగా రెండోసారి అధికారపక్షంగా ఉన్న వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే రాజాం నియోజకవర్గానికి ఏమి చేశారని ప్రశ్నించారు, ఎన్నికల సమీపించగానే ఇప్పుడే రోడ్లు గుర్తొచ్చాయి అని ప్రశ్నించారు, రాజాం నుంచి పాలకొండ కి రోడ్డు ఎప్పుడో మంజూరు అయినా ఇంతకాలం ఏమి చేశారన్నారు. ఇప్పుడైనా ఈ రోడ్డుని పర్మినెంట్ గా ఉండేటట్టు చేయాలి గాని గోతులు దగ్గర ఇసుక కంకరు వేసి కప్పడం వల్ల ఏమీ లాభం అన్నారు. గత ఐదు సంవత్సరాల్లో ఇటువంటివి ప్రస్తుత ఎమ్మెల్యే చాలా చేశారన్నారు కానీ ఏమి లాభం మరుసటి రోజుకే మరల ఆ రోడ్లు పాడైపోద్ది. ప్రస్తుత ఎలక్షన్స్ వల్ల లబ్ధి పొందడానికి ఇటువంటి చేసిన పనులు రాజాం నియోజకవర్గ ప్రజలు గ్రహిస్తారని అన్నారు. రానున్న ఎన్నికల్లో రాజాం నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి కి ఘోర పరాభవం తప్పదని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img