మనీలా : ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టె రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తాను పాల్గొనబోనని డుటెర్టె శనివారం ప్రకటించారు. అక్కడి రాజ్యాంగం ప్రకారం, అధ్యక్షుడిగా ఆరేళ్లు పూర్తిచేసుకున్న అధ్యక్షుడు మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడు. అయితే దవావో మేయర్గా ఉన్న ఆయన కుమార్తె సారా డుటెర్టె అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు మార్గం సుగమం చేసినట్లు న్యాయ, రాజకీయ ప్రొఫెసర్ అండోనియో లా అన్నారు. రానున్న ఎన్నికల్లో డుటెర్టె విధేయుడైన సెనేటెర్ క్రిస్టోఫర్ ఉపాధ్యక్షుడుగా పోటీ చేయనున్నారు.