5 వైద్య పరికరాలపై ధర తగ్గింపు
థర్డ్వేవ్ ముప్పు పొంచి ఉందన్న ప్రచారంతో కేంద్ర ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా కొవిడ్ చికిత్స నివారణకు ఉపయోగించే పరికరాల ధరలను తగ్గిస్తుంది. ఆక్సిమీటర్లు, డిజిటల్ థర్మామీటర్లతో సహా ఐదు వైద్య పరికరాలపై ప్రభుత్వం 70 శాతం వాణిజ్య మార్జిన్ను నిర్ణయించింది. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ ఐదు వైద్య పరికరాల వాణిజ్య మార్జిన్లపై పరిమితులు విధించడానికి ఫార్మాస్యూటికల్ ప్రైస్ను ఆమోదించింది. ఇందులో ఆక్సిమీటర్, గ్లూకోమీటర్, బీపీ టెస్టింగ్ మెషిన్, నెబ్యులైజర్ , డిజిటల్ థర్మామీటర్ ఉన్నాయి. వీటికి సంబంధించి వాణిజ్య మార్జిన్లను హేతుబద్ధీకరించడానికి ఎన్పీపీఏ చర్యలు తీసుకున్నట్లు ట్విట్టర్లో పేర్కొంది. ఎన్పీపీఏ ప్రకారం సవరించిన ధరలు జూలై 20 నుంచి అమల్లోకి రానున్నాయి.