Friday, May 3, 2024
Friday, May 3, 2024

11వ రోజు కొనసాగుతోన్న అమరావతి మహాపాదయాత్ర

అమరావతి పరిరక్షణ సమితి, జేఏసీ నాయకులు చేపట్టిన పాదయాత్ర 11వ రోజు కొనసాగుతోంది. ఈరోజు కృష్ణా జిల్లా గుండుపాలెం నుంచి మహాపాదయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు శివారెడ్డి మాట్లాడుతూ, అసెంబ్లీ సీఆర్‌డీఏ చట్టానికి సవరణలు చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. ఈ చట్టానికి సవరణలు చేయకుండా యథావిధిగా అమలు చేయాలని హైకోర్టు ఆదేశించినా ప్రభుత్వం మాత్రం అవేమి పట్టించుకోకుండా సవరణ బిల్లుకు సవరణలు చేస్తూ అసెంబ్లీలో ప్రవేశపెట్టడంపై కోర్టుకు వెళ్తామని పేర్కొన్నారు. ఏపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, మహా పాదయాత్ర రైతులందరినీ ఐక్యం చేస్తుందని ఆంధ్రుల రాజధాని అమరావతిగా ఉంటుందని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img