Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

రూ. 10 లక్షలు విలువ చేసే పప్పు సెనగ పంట దగ్ధం

విశాలాంధ్ర..ఉరవకొండ..ఉరవకొండ మండలం ఆమిద్యాల గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే రైతుకి సంబంధించిన నూర్పిడికి సిద్ధంగా ఉన్న పప్పు సెనగ పంట గురువారం తెల్లవారుజామున దగ్ధమైంది. దాదాపు పది లక్షల వరకు నష్టం జరిగింది.ఈ సంఘటనపై రైతు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పది ఎకరాలలో తాను పప్పు శనగ పంటను సాగు చేశానని నూర్పిడికి సిద్ధంగా ఉన్న సమయంలో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారని ఆరోపించారు. సంఘటనపై విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని రైతు పేర్కొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img