Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

నీటి సమస్య పరిష్కరించిన వార్డు సభ్యులు వసికేరి మల్లికార్జున

విశాలాంధ్ర-ఉరవకొండ : ఉరవకొండ పట్టణంలోనే శివరామి రెడ్డి కాలనీలో వాటర్ ట్యాంక్ కి సంబంధించిన మోటర్ చెడిపోవడంతో కాలనీవాసులు నీటి సమస్యను ఎదుర్కొన్నారు. సోమవారం 15వ వార్డు సభ్యులు వసికేరి మల్లికార్జున దృష్టికి కాలనీవాసులు సమస్యను తీసుకెళ్లడంతో ఆయన వెంటనే గ్రామ సర్పంచ్ మరియు కార్యదర్శి తో మాట్లాడి దగ్గరుండి మోటర్ మరమ్మత్తులు చేయించారు. సమస్య పరిష్కారం కావడంతో కాలనీవాసులు వార్డు సభ్యులకు, సర్పంచ్ కార్యదర్శులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img