Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

రథోత్సవం సందర్భంగా వైద్య శిబిరం

విశాలాంధ్ర-ఉరవకొండ : ఉరవకొండ గవిమఠ శ్రీస్థిత చంద్రమౌళీశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని బుధవారం ఉరవకొండ ప్రభుత్వ హాస్పిటల్ అధ్వర్యంలో మఠం ఆవరణలో ఉచిత వ్యైద్య శిబిరం ఏర్పాటు చేశారు.ఈ వైద్య శిబిరం రెండు రోజులు పాటు భక్తులకు అందుబాటు లో వుంటుందని స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్ సాహితీ మరియు డాక్టర్ వినితా తెలియచేసినారు. ఈ వైద్య శిబిరం లో పట్టణ ఆరోగ్య కార్యక్తలు నిమ్మల వెంకటేష్, మోతి లాల్ నాయక్, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ మమత, సులోచన మరియు ఆశా కార్యకర్తలు శిరీష, కళ్యాణి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img