Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

గుంతకల్లులో ఘనంగా కార్ల్ మార్క్స్ 205 జయంతి వేడుకలు…

ముఖ్య అథితులు సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బి.గోవిందు…

విశాలాంధ్ర-గుంతకల్లు : పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో కమ్యూనిస్ట్ సిద్ధాంతకర్త కార్ల్ మార్క్స్ 205 వ జయంతి కార్యక్రమాలను సిపిఐ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బి.గోవిందు,సీపీఐ నియోజికవర్గం కార్యదర్శి వీరభధ్రస్వామి,సీపీఐ పట్టణ కార్యదర్శి గోపినాథ్ లు కార్ల్ మార్క్స్ చిత్రపటానికి పులతో నివాళులర్పించారు. అనంతరం కేక్ ని కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు.ఈ సందర్బంగా బి.గోవిందు,వీరభధ్రస్వామి,గోపినాథ్ మాట్లాడుతూ…దోపిడీ లేని సమాజ నిర్మాణంలో భాగంగా, కమ్యూనిస్టు సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్ల్ మార్క్స్ ఎంతో కృషి చేశారని అన్నారు. సమసమాజ స్థాపనకు కార్ల్ మార్క్స్ చేసిన కృషి ఎనలేనిదని అన్నారు.నాడు ఆయన రచించిన గ్రంథాలు ప్రజలకు ఎంతో చైతన్యం అన్నారు. ఆయన స్ఫూర్తితో ఆయన బాటలోనే నడుద్దామని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సీపీఐ పట్టణ సహాయ కార్యదర్శి ఎస్ ఎం డి గౌస్, సిపిఐ మండల సహాయ కార్యదర్శి రామాంజనేయులు, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి పిసి కుల్లయప్ప, సిపిఐ నాయకులు మల్లయ్య ,మురళి,నాగేంద్ర ,గురు స్వామి, దౌల, షబ్బీర్ ,ఆటో శివ ,ఏఐఎస్ఎఫ్ నాయకులు వేణుగోపాల్, వినోద్ ,అఖిల్ ,మున్సిపాల్ యునియన్ కొండయ్య,నరసయ్య,హమాలీలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img