Friday, May 17, 2024
Friday, May 17, 2024

క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయి

వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధాకర్

విశాలాంధ్ర – చింతపల్లి ( అల్లూరి సీతారామరాజు జిల్లా) :- మానసిక ఉల్లాసానికి, దేహ దారుడ్యానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని వైకాపా ఎస్ టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జెల్లీ సుధాకర్ అన్నారు. స్థానిక సర్పంచ్ దురియా పుష్పలత, హేమంత్ కుమార్ దంపతులు మండలంలోని గడప రాయి, మల్లవరం గ్రామాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డివిజనల్ క్రికెట్ టోర్నమెంట్ లో వివిధ గ్రామాలకు చెందిన జట్లు పాల్గొన్నాయి. ప్రథమ ద్వితీయ స్థానాల కోసం బుధవారం జరిగిన హోరాహోరీ పోరులో పెదవలస జట్టు ప్రథమ స్థానాన్ని గడపరాయి జట్టు ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ఈ సందర్భంగా బహుమతులు ప్రధానం కార్యక్రమానికి మాజీ ఎంపీపీ, వైకాపా రాష్ట్ర కార్యదర్శి వంతల బాబురావుతో కలసి ముఖ్య అతిథిగా విచ్చేసిన సుధాకర్ క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. ప్రధమ స్థానంలో నిలిచిన పెదవలస జట్టుకు మొదట బహుమతిగా 20 వేల రూపాయల నగదుతో పాటు సీల్డ్ ను హేమంత్ కుమార్ చేతుల మీదుగాను, ద్వితీయ స్థానంలో నిలిచిన గడపరాయి జట్టుకు సుధాకర్ చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేశారు. ప్రత్యేక బహుమతులను మాజీ ఎంపీపీ, వైకాపా రాష్ట్ర కార్యదర్శి చేతుల మీదుగా క్రీడాకారులకు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు అధిక సంఖ్యలో క్రీడాకారులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img