Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

పత్రికా స్వేచ్ఛను హరిస్తున్న వైసిపి ప్రభుత్వం

దాడిని ఖండించిన తెదేపా నాయకులు

విశాలాంధ్ర – పెనుకొండ :పెనుకొండ పట్టణమునందు శనివారం తెలుగుదేశం పార్టీ సవితమ్మ కార్యాలయం నందు సవితమ్మ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ శుక్రవారం కడప జిల్లాలో పాత్రికేయులపై దాడి జరిగిన సంఘటనపై తీవ్రంగా ఖండించారు అవినాష్‌రెడ్డి ఎంపీనా? లేక వీధిరౌడీనా?
వాస్తవాలను వెలికి తీసే, నిజాలను నిర్భయంగా ప్రసారం చేస్తున్న మీడియా ప్రతినిధులపై అవినాష్‌రెడ్డి రౌడీలు దాడి చేయడం దుర్మార్గం దాడికి తెగబడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.సీబీఐ విచారణకు హాజరు కాకుండా కుంటి సాకులు చెప్పి పారిపోతున్న అవినాష్ రెడ్డి బాగోతాన్ని కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై వైసీపీ గూండాల దాడి చేయడందారుణం,దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆమెతో పాటుగా త్రివేంద్ర నాయుడు గోపాల్ ,ఐ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మంజునాథ్,మాజీ ఎంపీటీసీ ముద్దన్న,చిన్నపోతన్న, నాగేంద్రప్ప, వీరచిన్న,నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img