విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ వై జంక్షన్ దగ్గర బస్టాండు లేక ప్రయాణికులు బెంగుళూరు వైపు వెళ్ళడానికి కానీ అనంతపురం వెళ్లడానికి కానీ కొన్ని బస్సులు పెనుకొండ బస్టాండ్ కు రాకుండా హైవే లోన వెళుతున్నందున ఎంత మంది ప్రయాణికులు బస్ కోసం మండే ఎండలో ఉండడం చూసి. ఎమ్మెల్యే శంకర్నారాయణ చొరవతో బుధవారం నగర పంచాయతీ చైర్మన్ ఉమర్ ఫారుక్ ఖాన్ మునిసిపల్ శాఖ కమిషనర్ వంశీ కృష్ణ భార్గవ్ ఏఈ రాజేంద్ర వారితో చర్చించి నేడు వై జంక్షన్ దగ్గర ప్రజల సౌకర్యార్థం బస్టాండ్ కొరకు స్థల పరిశీలించి బస్టాప్ నిర్మాణం పనులు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ సునీల్ కుమార్ వైశాలి జయశంకర్ రెడ్డి మండల అధ్యక్షుడు గీత రామ్మోహన్ రెడ్డి జెడ్పిటిసి శ్రీరాములు అగ్రి చేర్మెన్ కొండలరాయుడు వివిధ కౌన్సిలర్ లు మరియు మున్సిపల్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.