. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి
విశాలాంధ్ర – ధర్మవరం : ప్రజా సమస్యలను గడప గడప అనే కార్యక్రమంలో పరిష్కరించడమే ప్రభుత్వము యొక్క ధ్యేయమని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఐదవ వార్డులో గురువారం గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఇంటింటా తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు తదుపరి ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల యొక్క లబ్ధిని కూడా వివరించడం జరిగింది. వాడు ప్రజలు పలు సమస్యలను తెలుపుతూ లో వోల్టేజీ సమస్య ఉందని, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే గంటల తరబడి అయినా తిరిగి మాకు విద్యుత్ రావడం లేదని, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎమ్మెల్యేకు వివరించారు. తదుపరి ఎమ్మెల్యే స్పందిస్తూ ఈ వార్డులో ట్రాన్స్ఫారం ఏర్పాటు చేయాల్సిందిగా విద్యుత్ అధికారులను వారు ఆదేశించారు. ఈ ట్రాన్స్ఫారంతో మీ లో వోల్టేజీ సమస్య తీరుతుందని వారు తెలిపారు. తాను ప్రజలకు ఇచ్చిన హామీల్లో వార్డులలో సిసి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే అన్ని పూర్తి అవ్వడం జరుగుతుందని తెలిపారు. పేదవారికి సా చురేషన్ పద్ధతిలో అర్హులైన పేదలందరికీ సచివాలయ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలను అందించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను 99 శాతము నిలబెట్టుకున్నారని దీంతో పేద ప్రజల మన్ననలు పొందడం జరిగిందన్నారు. సచివాలయ సిబ్బంది వాలంటీర్లు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు తప్పక అవగాహన ఇవ్వాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కాచర్ల లక్ష్మి, వైస్ చైర్మన్లు భాగ్యలక్ష్మి, పెనుజూరు నాగరాజు, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, వివిధ విభాగాల అధికారులు, సచివాలయ సిబ్బంది,వార్డు కౌన్సిలర్ లాలేనాయక్, వార్డ్ ఇంచార్జ్ దాసు నాయక్ తదితరులు పాల్గొన్నారు.