విశాలాంధ్ర-ధర్మవరం : పట్టణంలోని రేగాటిపల్లి రైల్వే గేట్ సమీపంలో పార్థసారధి నగర్ దుర్గా నగర్ ల మధ్య 40 సంవత్సరాలు వయసుగల ఒక మగ వ్యక్తి శుక్రవారం ఉదయం కిందపడి మృతి చెందడం జరిగిందని జి ఆర్ పి.. హెడ్ కానిస్టేబుల్ ఎర్రి స్వామి కానిస్టేబుల్ విజయ్ కుమార్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ సమాచారం అందుకున్న తాము మృతదేహం వద్ద చేరుకొని వ్యక్తి వివరాలు ఏమైనా తెలుస్తాయా అని విచారణ చేపట్టగా, ఎటువంటి గుర్తింపు కార్డులు లేవని తెలిపారు. ఎడమ చేతికి తెలుగులో పుష్ప అను పచ్చబొట్టు ఉన్నదని, బట్టలు వైట్ షర్ట్ బ్లాక్ పవర్స్ డిజైన్, సిమెంట్ కలర్ సిమెంట్ కలర్ లుంగీ ఉన్నదని తెలిపారు. అంగీ పైన ఎల్పీ సర్కిల్ శివ టైలర్స్ అని కాలర్ మార్కు ఉన్నదని తెలిపారు. ధర్మవరం పట్టణ వాసిగా తాము అభిప్రాయపడుతున్నామని, ఎవరికైనా ఈ మృతదేహం యొక్క వివరాలు తెలిసిన యెడల ఫోన్ నెంబర్ 9441238182 సంప్రదించాలని తెలిపారు. సచివాలయంలో కూడా సమాచారాన్ని అందిస్తూ,, వివిధ వాట్సాప్ లలో కూడా మృతుని యొక్క ఫోటోలు పంపించడం జరిగిందన్నారు. తదుపరి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇది ఆత్మహత్యనా? లేదా ప్రమాదవశాత్తు జరిగిందా? అన్న కోణంలో దర్యాప్తును చేపట్టామని హిందూపురం జి ఆర్ పి పోలీసులు తెలిపారు.