విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని శివానగర్లో గల మసీదు తో పాటు మదరస అభివృద్ధి కొరకు పట్టణంలోని చేనేత ప్రముఖులు ఆరవ వార్డ్ వైఎస్ఆర్సిపి పార్టీ ఇంచార్జ్ కాచర్ల అంజి నేత 25వేల రూపాయలు, సిద్ధి రాజేష్ నేత 25వేల రూపాయలు, చింతా బాలకృష్ణ నేత 25వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని మసీదు కమిటీ కు శుక్రవారం రోజున మసీదులో అందజేశారు. ఈ సందర్భంగా చేనేత ప్రముఖులు మాట్లాడుతూ మదరస పేరిటన ఎంతోమంది ముస్లిం విద్యార్థులు మదరసాను అభ్యసిస్తున్నారని, వీరికి వసతి సౌకర్యాలు కొంతవరకు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్న విజ్ఞప్తి మేరకు,ఈ ఆర్థిక సహాయమును అందించడం జరిగిందని వారు తెలిపారు. తదుపరి మసీదు కమిటీ నిర్వాహకులు చేనేత ప్రముఖులకు ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు.