విశాలాంధ్ర – పెనుకొండ : పెనుకొండ ఎమ్మెల్యే శంకర్నారాయణ ను శుక్రవారం ఇంచార్జ్ డిఇఓ రంగస్వామి మరియు కొంతమంది ప్రధానోపాధ్యాయులు కలసి 17వ తేదీన సత్యసాయి జిల్లాలో జరిగే అనంత ఆణిముత్యాల పంపిణీ కార్యక్రమానికి విచ్చేయవలసిందిగా ఎమ్మెల్యే కార్యాలయం నందు ఆహ్వాన పత్రికను అందజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలోనూ కాలేజీలోనూ పేద విద్యార్థులు అత్యధిక మార్కుల సాధించిన వారిని ఘనంగా సన్మానించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందున తప్పక హాజరు కావాలని పేద విద్యార్థులను సన్మానించడంలోని తృప్తి ఉందని కావున జిల్లా స్థాయి సమావేశానికి హాజరు కావాలని ఇంచార్జ్ డివోo రంగస్వామి తెలిపారు ఆయనతోపాటుగా ప్రధానోపాధ్యాయులు నాగార్జునుడు, రంగప్ప, శివరాం, నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.