ప్రధానోపాధ్యాయురాలు మేరీ వర కుమారి
విశాలాంధ్ర – ధర్మవరం : అనంత ఆణిముత్యాలు విద్యార్థులకు వరం లాంటివని కొత్తపేట మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మేరీ వర కుమారి తెలిపారు. ఈ సందర్భంగా శనివారం వారు మాట్లాడుతూ అనంత ఆణిముత్యాలు కార్యక్రమంలో మా పాఠశాల తరఫున జిల్లా మూడవ స్థానంలో వచ్చిన విద్యార్థిని టీ. ముబాసిరా కు శనివారం కలెక్టర్ అరుణ్ బాబు చేతుల మీదుగా నగదు, బహుమతితో పాటు ప్రశంసా పత్రము షీల్డ్ ను అందించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా హెచ్ఎం తో పాటు, టీచర్ రాము, ఉపాధ్యాయ బృందం, బోధ నేతర సిబ్బంది తోటి విద్యార్థులు ఆ విద్యార్థినికి అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.