విశాలాంధ్ర – పెనుకొండ : పెనుకొండ పట్టణమునందు శనివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల కృష్ణాజిల్లా గుడివాడలో దళిత మహిళ ఆసిలేటి నిర్మలాను అరెస్టు చేయడం దారుణమని ఆమె ఖండింస్తు వైసీపీ ప్రభుత్వం పై మండిపడ్డారు ఆమె మాట్లాడుతూ ప్రశ్నిస్తే దాడులు, అరెస్టులు , సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటనలో నిరసన వ్యక్తం చేసిన వారిపై కేసును నమోదు చేయడం ఏమిటని ఆమె ప్రభుత్వంపై మండిపడ్డారుఈ నాలుగు సంవత్సరాల అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏం చేశావని ప్రశ్నిస్తూ నిరసన తెలుపుతూ ఉండగా అరెస్టు చేయడం దుర్మార్గం, అసలు నిరసన ఎందుకు తెలిపింది తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కట్టిపూర్తి చేసిన ఇళ్ళని నాలుగేళ్లుగా తొక్కిపెట్టి ఇప్పుడు ఎలక్షన్ ముందు అతని అనుచరులు కు ఇస్తుంటే అసలైన లబ్ధిదారులు నష్టం జరుగుతుందని నిరసన తెలిపింది అయినా చంద్రబాబు గారి హయాంలో కట్టిన ఇళ్లను మీ నాయన వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం పెట్టి పంచడం ఏంటి అని నిరసన చేయడం తెలియజేయడం కూడా తప్పేన అంటూ ఇలా అరెస్టులు చేస్తూ పోతుంటే వచ్చే ఎన్నికల్లో మీకు మహిళలే బుద్ధి చెబుతారని వైసీపీ ప్రభుత్వం పై మండిపడ్డారు.